ఆ తెలుగు నటి.. ఇప్పుడు ఓ దేశ ప్రధాని!

తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించిన కన్నడ నటి రంజిత గుర్తుందా? ఆమె ఓ దేశానికి ప్రధాని అయ్యారు. ఇదేదో జనం ఎన్నుకున్న..

Update: 2023-07-07 05:31 GMT


కైలాస దేశానికి ప్రధానిగా నటి రంజిత

తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించిన కన్నడ నటి రంజిత గుర్తుందా? ఆమె ఓ దేశానికి ప్రధాని అయ్యారు. ఇదేదో జనం ఎన్నుకున్న ప్రధాని పదవి కాదు. ఆమెను వివాదాల్లోకి లాగిన ఆమె గురువు ప్రసాదించిన పదవి! ఇదంతా అయోమయంగా ఉందా? అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.

వివాదాస్పద గురువు నిత్యానంద గుర్తున్నారా? హిందూ ధర్మానికి వారధిగా చెప్పుకుంటూ దేశ, విదేశీ భక్తులను సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన నిత్యానంద.. సినీనటి, తన శిష్యురాలు రంజితతో సరసాలాడుతూ 2010లో ఓ వీడియోకి చిక్కారు. దీంతో ఆయన పరువు రోడ్డున పడిరది. తాను అసలు మగాడ్నే కాదంటూ కోర్టు మెట్లక్కడం, ఆయనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడం, ఆయన మగాడే అంటూ పరీక్షల్లో బయటపడటం ఇదంతా చరిత్ర.

ఈ వివాదాల నేపథ్యంలో ఆయన దేశం విడిచి పారిపోయారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చారు. తాను స్వయంగా ఓ దేశాన్ని సృష్టించినట్లు ప్రకటించారు. దానికి ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’ అంటూ పేరు పెట్టారు. ఆ దేశానికి కరెన్సీ, మంత్రి మండలి, పరిపాలన అంటూ హడావుడి చేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశానికి కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు హాజరు కావడం గమనార్హం. తమ దేశాన్ని కూడా గుర్తించాలని, సభ్యత్వం ఇవ్వాలని నిత్యానంద డిమాండ్‌ కూడా చేశారు. అయితే ఆ దేశం ఎక్కడుందో ఎవరికీ తెలియకపోవడం విశేషం.

ఎన్ని ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టినా నటి రంజిత మాత్రం ఆయనను సేవించడం మానలేదు. భర్తకు విడాకులిచ్చి మరీ ఆమె నిత్యానంద ఆశ్రమంలో చేరారు. మావి చిగురు లాంటి సినిమాలతో రంజిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తనను అంటి పెట్టుకుని ఉన్న శిష్యురాలికి కైలాస దేశ ప్రధాని హోదాను నిత్యానంద బహుకరించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే, ఓ దేశ ప్రధాని హెదాలో ఆమె మన దేశాన్ని కూడా సందర్శిస్తారేమో!



Tags:    

Similar News