చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి

ఆదివారం నాడు నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన ముష్కరులు కాథలిక్ చర్చిలోకి చొరబడి

Update: 2022-06-06 03:21 GMT

ఆదివారం నాడు నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన ముష్కరులు కాథలిక్ చర్చిలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది ఆరాధకులు మరణించారని.. మరికొందరు గాయపడ్డారని ప్రభుత్వం, పోలీసులు తెలిపారు. ఒండో స్టేట్‌లోని ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చి వద్ద చోటు చేసుకున్న హింస నైజీరియా నైరుతి ప్రాంతంలో ఒక అరుదైన దాడిగా చెబుతున్నారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని ఆ దేశ మీడియా చెబుతోంది.

కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో బిషప్, పాస్టర్లు క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు చెప్పారు. ఓవోలోని ఆసుపత్రులకు 50 మృతదేహాలకు పైగా తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఖచ్చితమైన మరణాల సంఖ్య వెంటనే స్పష్టంగా తెలియలేదు, కానీ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ప్రజలను దారుణంగా చంపడాన్ని ఖండించారు. ముష్కరులు పేలుడు పదార్థాలతో చర్చిపై దాడి చేశారని, ఎక్కువ మంది ఆరాధకులు మరణించారని రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఇబుకున్ ఒడున్లామి తెలిపారు. "ఎంత మంది మరణించారో ఖచ్చితంగా చెప్పడం ఇంకా చెప్పలేకపోతున్నాం. కానీ చాలా మంది ఆరాధకులు తమ ప్రాణాలను కోల్పోయారు, మరికొందరు దాడిలో గాయపడ్డారు," ఆమె AFP కి చెప్పారు.


Tags:    

Similar News