మెక్సికోలో దారుణం.. దుండగుల కాల్పుల్లో 21 మంది మృతి

కాగా.. 2015-17 మధ్య గెరెరోను నాశనం చేసిన లాస్ టెక్విలెరోస్ క్రిమినల్ గ్యాంగుపై ఈ దాడి జరిగినట్లుగా అక్కడి పోలీసులు..

Update: 2022-10-07 04:59 GMT

మెక్సికోలో దుండగులు మారణహోమం సృష్టించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మేయర్, చట్టసభ్యురాలు కూడా ఉన్నారు. శాన్ మిగేల్ టోటోలాపన్ పట్టణంలో మేయర్ కొన్రాడో మెనండోజా అల్మెడా అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా.. దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్, ఆయన తండ్రి సహా 21 మంది మృతి చెందారు. అనంతరం నిందితుల కోసం ఆర్మీ, నేవీ రంగంలోకి దిగింది.

కాగా.. 2015-17 మధ్య గెరెరోను నాశనం చేసిన లాస్ టెక్విలెరోస్ క్రిమినల్ గ్యాంగుపై ఈ దాడి జరిగినట్లుగా అక్కడి పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కు నాయకుడైన రెబెలో జాకోబో డి అల్మోంటో హతమయ్యే వరకు ఈ ప్రాంతంలో మేయర్లను వారు బెదిరిస్తూ ఉండేవారు. మేయర్ అల్మెడాకు చెందిన పార్టీ పార్టిడో డి లా రెవెల్యూసియన్ డెమొక్రిటికా (పీఆర్‌డీ) ఈ ఘటనను ఖండించింది. మోరెలోస్ రాష్ట్రంలోని క్యుర్నవాకాలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలు గాబ్రియెలా మరీన్‌ ప్రాణాలు కోల్పోయారు.



Tags:    

Similar News