Nigeria : నైజీరియాలో ఊచకోత.. 160 మంది మృతి

నైజీరియాలో జరిగిన దాడుల్లో దాదాపు 160 మందికి పైగానే మరణించనట్లు తెలుస్తోంది.

Update: 2023-12-26 01:50 GMT

160 people died in the attacks in nigeria

నైజీరియాలో జరిగిన దాడుల్లో దాదాపు 160 మందికి పైగానే మరణించనట్లు తెలుస్తోంది. నైజీరియాలో బందిపోట్ల ముఠాలు ఈ దాడులకు తెగబడ్డాయి. అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు. 160 మంది వీరి దాడుల్లో చనిపోగా మూడు వందలకు పైగా గాయాలపాలపై ఆసుపత్రి పాలయినట్లు అధికారులు వెల్లడించారు. సెంట్రల్ నైజీరియాలోని అనేక గ్రామాలపై సాయుధులైన బందిపోట్ల ముఠాలు ఈ దాడులకు తెగబడ్డాయి.

దాడులకు తెగబడటంతో...
అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. మతపరమైన, జాతి ఉద్రిక్తతలతో అనేక ఏళ్లుగా జరుగుతున్న ఈ పోరాటంలో అత్యధికంగా మరణించినట్లు అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 113 మంది మరణించినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేసి చికిత్స అందిస్తున్నారు. భద్రతబలగాలు వెంటనే చర్యలు తీసుకుని ఈ దాడులను ఆపాలని కోరుతున్నారు.



Tags:    

Similar News