ప్రపంచంలో అతి ఘాటుగా ఉండే మిర్చిని ఎక్కడ పండిస్తారో తెలుసా?

మన భారతీయులు స్సైసీ ఫుడ్‌ అధికంగా తింటుంటారు. అదే సమయంలో పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా తినేవారు ..

Update: 2023-10-21 12:36 GMT

మన భారతీయులు స్సైసీ ఫుడ్‌ అధికంగా తింటుంటారు. అదే సమయంలో పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా తినేవారు కూడా చాలా మందే ఉన్నారు. కొందరు కూరల్లో పొడికారం కాకుండా పచ్చి మిర్చివేసి కూడా వండుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత స్పైసీగా ఉండే మిరప ఏది? ఏ దేశంలో పండిస్తారో తెలుసా? మరీ ప్రపంచంలో అత్యంత ఘాటుగా ఉండే మిరపకాలయ గురించి తెలుసుకుందాం.

భూత్ జోలాకియా అనే పచ్చి మిర్చి పేరు మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని అస్సాంలో పండిస్తారు. ఈ కారం ప్రపంచంలోనే అత్యంత ఘాటుగా ఉండే మిరపగా గుర్తించారు. 2007లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో దీని పేరు నమోదు కావడానికి కారణం ఇదే. దీన్ని ఘోస్ట్ పేపర్ అని కూడా పిలుస్తుంటారు. స్థానిక భాషలో అస్సాం ప్రజలు దీనిని యు-మొరోక్, లాల్ నాగా లేదా నాగా జోలోకియా అని కూడా పిలుస్తారు. అస్సాంతో పాటు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా దీనిని సాగు చేస్తారు. భూత్ జోలాకియా భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మిర్చి ధర ఎంతో తెలుసా..? కిలోకు వేలల్లో ఉంటుందట.

ఇక మసాలా పరంగా చూస్తే డ్రాగన్స్ బ్రీత్ చిల్లీ రెండవ స్థానంలో ఉంది. దీనిని బ్రిటన్‌లో సాగు చేస్తారు. దీని కారం 2.48 మిలియన్ స్కోవిల్లే యూనిట్ల వరకు కొలుస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే దాదాపు 2000 రెట్లు ఎక్కువ. ఈ కారాన్ని కొన్ని ఔషధాలలో వినియోగిస్తారట. ఈ మిరపకాయలో కొంచెం భాగాన్ని ఆహారంలో కలిపితే ఆహారం మొత్తం కారంగా మారుతుందని అంటున్నారు.

అదేవిధంగా నాగ వైపర్ కూడా ప్రపంచంలోని అత్యంత ఘాటు మిరపకాయలలో ఒకటిగా ఉంది. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మిరపకాయ. దీనిని బ్రిటన్‌లో మాత్రమే సాగు చేస్తారట. దీనికి ఉన్న పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఒక్కో మిర్చి రంగు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అంటే దాని రంగు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు కావచ్చు.

కరోలినా రీపర్ కూడా చాలా వేడి మిరియాలుగా పరిగణిస్తారు పరిశోధకులు. దీని పేరు 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో స్పైసినెస్ కోసం నమోదు అయ్యింది. ఇది అమెరికాలో మాత్రమే సాగు చేస్తారట. కరోలినా రీపర్ కూడా ఒక రకమైన హైబ్రిడ్ మిరియాలు. ఈ మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. స్పైసీగా తినేవారు కూడా దీనికి దూరంగా ఉంటారట.

Tags:    

Similar News