అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలవరం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు

Update: 2022-07-18 03:57 GMT

అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలవరం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనంతరం ఒక పౌరుడు నిందితుడిని కాల్చి చంపారు. ఇండియానా మాల్ లోని ఫుడ్ కోర్టు లో ఈ కాల్పులు జరిగాయి. ఫుడ్ కోర్టులోకి ఒక్కసారిగా వచ్చిన ఆగంతకుడు కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో మాల్ లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ఒక పౌరుడు దుండగుడిపై కాల్పులు జరిపాడు.

నిందితుడు కూడా...
ఈ కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. దీంతో మొత్తం ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లయింది. కాల్పుల ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News