అఫ్గానిస్థాన్‌ కు సాయం పంపిన భారత్

మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు భార‌త్ కూడా ప్ర‌క‌టించింది. అఫ్గానిస్థాన్ ప్ర‌జ‌ల‌కు

Update: 2022-06-24 08:34 GMT

భూకంపం వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన అఫ్గానిస్థాన్‌కు సాయం చేసేందుకు భార‌త్ ముందుకు వచ్చింది. అఫ్గాన్‌లో ఇటీవ‌ల సంభ‌వించిన భూకంపం వ‌ల్ల 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. "భూకంప బాధితుల‌కు, వారి కుటుంబాల‌కు సానుభూతి తెలుపుతున్నాను. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు భార‌త్ కూడా ప్ర‌క‌టించింది. అఫ్గానిస్థాన్ ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది" అని ఐక్య‌రాజ్య స‌మితిలోని భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు. భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరీందం బాగ్చీ కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ.. ఇప్ప‌టికే అఫ్గాన్‌కు సాయంగా భార‌త్ నుంచి స‌రుకులు పంపామ‌ని, అవి కాబూల్ చేరుకున్నాయ‌ని తెలిపారు. మిగ‌తా సాయం కూడా త్వ‌ర‌లోనే అందుతుద‌ని తెలిపారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఆఫ్గ‌న్ల‌కు భార‌త దేశం త‌న వంతు సాయంగా గోధుమ‌ల‌ను పంపించింది. రెడ్ క్రాస్ సొసైటీ త‌న సేవ‌లు ప్రారంభించింది. ఆహారం, అత్యవసర మందులు, ఇతర పరికరాలు, సహాయ సామగ్రితో కూడిన విమానాలు గురువారం.. రాత్రే ఆ దేశ రాజధాని కాబూల్ కు చేరుకోగా.. ఈ రోజు ఉదయం మరో విమానంలో మరింత సహాయ సామగ్రిని తరలించారు. పలువురు సాంకేతిక, వైద్య నిపుణులతో కూడిన బృందం కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లింది. అఫ్గానిస్థాన్‌ కు మొట్ట మొదట సాయాన్ని పంపింది భారతదేశమేనని అరిందం బాగ్చీ పేర్కొన్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. భారత దౌత్యవేత్త శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో చర్చలు జరిపారు. భారత్ ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల రుణాలు, ఇతర సాయం అందించింది. తాజాగా మరింత సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది.


Tags:    

Similar News