భాగ్యనగరం వాసులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో సజ్జనార్‌ ఎండీగా వచ్చిన తర్వాత..

Update: 2023-09-02 02:59 GMT

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో సజ్జనార్‌ ఎండీగా వచ్చిన తర్వాత ప్రయాణికులకు సౌకర్యాలు మరింత మెరుగయ్యాయి. కొత్త కొత్త టికెట్‌ ఆఫర్లు కల్పిస్తున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ఎయిర్‌పోర్ట్‌కు, అలాగే విజయవాడకు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయితే తాజాగా ఈ బస్సులు నగరంలోనూ నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ.

భాగ్యనగరంలోని పలు రూట్లలో ఈ బస్సులను నడపాలనే ఆలోచనలో ఉంది. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఏ రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఏయే రూట్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.? ఏయే రూట్లలో ఈ బస్సులు నడిపితే సంస్థకు మంచి ఆదాయం వస్తుందన్న విషయాలపై ఆర్టీసీ ఆన్‌లైన్‌ సర్వే సైతం నిర్వహిస్తుంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రత్యేకత ఏమిటి..?

ఈ ఎలక్ట్రిక్‌ బస్సులలో అత్యాధునిక సౌకర్యాలు అందించారు. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో మొత్తం 35 సీట్లు ఉంటాయి. అలాగే మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సీటుకొక పోర్ట్‌ను అందించారు. భద్రత కోసం బస్సులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. బస్ స్టాపులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుగా ఎల్‌ఈడీ బోర్డులను ప్రదర్శిస్తారు. ఇక ఈ బస్సు ప్రత్యేకతల విషయానికొస్తే ఒక్కసారి ఛార్జింగ్ చస్తే ఏకంగా 225 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. బస్సు ఫుల్ ఛార్జ్‌ కావడానికి 2 గంటల సమయం పడుతుంది.

బస్సులో సీటు బెల్ట్‌..

ప్రయాణికుల భద్రత కోసం ఈ బస్సులో ప్రతీ సీటుకు ఒక పానిక్‌ బటన్‌ను అందించారు. అలాగే వెహికల్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ను సైతం ఇచ్చారు. బస్సులో సీటు బెల్ట్‌ మరో ప్రత్యేకత. ఒలెక్ట్రా కంపెనీ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఈ సంవత్సరం 500 ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే త్వరలోనే 25 బస్సులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News