తెలంగాణ హైకోర్టుకు చేరిన.. కాలుష్య 'దుర్గం'

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతూనే

Update: 2023-12-16 06:59 GMT

durgam cheruvu

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ కనిపించాయి. చేపలు ఆక్సిజన్ ఆందక నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేపలు చనిపోవడంపై సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చెరువులోని నీటిని పరీక్షించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దుర్గం చెరువు ప్రమాదంలో ఉన్నట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్ ఐఐటీహెచ్ టీమ్ గతంలోనే హెచ్చరించింది.


ఈ చెరువు ఇప్పుడు వ్యర్థాలు, కాలుష్యంతో నిండిపోయినట్లు స్టడీ చేసింది. దుర్గంలో చెరువులో వివిధ కంపెనీల నుంచి వస్తున్న కెమికల్స్ కలవడంతో నీరు ప్రమాదకరంగా మారిందని.. చెరువు నీటిలో ఇప్పటికే ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోయిందని.. చేపలు, కప్పలు, ఇతర జలచరాలు దుర్గం చెరువులో బతకడం కష్టమేనని తెలిపారు. చెరువు నీటిలో యాంటి డిప్రెసెంట్స్, పెయిన్కిల్లర్స్, యాంటి ఒబెసిటీ మెడిసిన్స్, వెయిట్ లాస్ తగ్గించే మెడిసిన్‌తో పాటు కొకైన్ వంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్లు స్టడీలో తేలింది. చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించి పలు పరీక్షలు చేయగా 183 రకాల సేంద్రియ సూక్ష్మ కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించారు. ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర సంహరిణులు, పురుగు మందులు, యూవీ ఫిల్టర్లు, స్టాస్టిసైజర్లు, సైనోటాక్సిన్లు, హార్మోన్లు, స్టెరాయిడ్లు, మెటాబోలైట్లు లాంటివి ఉన్నట్లు తేల్చారు



దుర్గం చెరువులో చేపలు చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్తను సుమోటోగా తీసుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్)గా మార్చింది. దుర్గం చెరువు ప్రమాదకరమైన స్థాయిలో ఉందని ఆ పత్రిక హైలైట్ చేసింది. గతంలో చేపలు చనిపోయిన విషయాన్ని కూడా కథనంలో ప్రస్తావించారు.


Tags:    

Similar News