ఆస్పత్రిలో రేవంత్‌ అన్న అంటూ మహిళ పిలుపు.. సీఎం ఏం చేశారంటే..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం ముఖ్యమంత్రి

Update: 2023-12-11 06:30 GMT

CM Revanth Reddy

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరామర్శించడానికి వెళ్లినప్పుడు రేవంత్‌రెడ్డికి ఓ ఘటన ఎదురైంది. రేవంత్‌ అన్నా.. మీతో మాట్లాడాలన్నా.. అంటూ వెనకనుంచి ఒక మహిళ పిలుపు వినిపించింది. దీనిని గమనించిన సీఎం రేవంత్‌ వెంటనే దగ్గరకు వెళ్లి ఏ సమస్య అని అడిగాడు.

ఆ మహిళ తన పాపను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్సకు చాలా ఎక్కువ ఖర్చు అవుతోందని, సాయం చేయాలని సీఎంను కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి వెళ్లారు. పూర్తి వివరాలు సేకరించి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంత హడావుడిలో ఉన్న రేవంత్‌రెడ్డి మహిళ పిలుపుతో వెంటనే ఆమె వద్దకు వెళ్లి సమస్యను వినడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News