South Central Railway : భారతదేశం లోనే కాదు. విదేశీ టూర్లకు వెళ్లాలనుందా? రైల్వే స్పెషల్ ఆఫర్ ఇదే

దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Update: 2025-09-18 04:24 GMT

రైళ్లలో ప్రయాణం సురక్షితం.. సుఖం. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆలయాలను సందర్శించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తీర్థయాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మధిర నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను అలాగే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ప్యాకేజీ 1:
దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు కు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఈ యాత్ర సెప్టెంబర్ 23 తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు అంటే ఎనిమిది రోజుల పాటు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14100, థర్డ్ ఏసీ ధర 22500, సెకండ్ ఏసీ ధర 29,500 రూపాయలుగా నిర్ణయించారు. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యహ్నం మరియు రాత్రి భోజనం, వాటర్ బాటిల్) మరియు టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలు లో 39 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ ప్రయాణ బీమా అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701,9281030726, 9281030750 లకు సంప్రదించచవ్చు. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్ సైట్ ని సంప్రదించాలి.

దేశంలో ప్యాకేజీలు : 

గుజరాత్: (ఎనిమిది రోజులు). రూ 38,000
కశ్మీర్: (ఆరు రోజులు) రూ.33750
మేఘాలయ, అస్సాం: : (7 రోజులు) రూ 43250
కర్ణాటక: (6 రోజులు) రూ 37050
అండమాన్ నికోబార్: (6 రోజులు) రూ. 54925
రాజస్థాన్ (6 రోజులు) రూ.32450
ఒడిశా (6 రోజులు) రూ.35,000,
తమిళనాడు (గ్రా రోజులు) రూ 34,600

అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలు

థాయిలాండ్ (ఐదు రోజులు) రూ.65,600,

శ్రీలంక (ఆరు రోజులు) రూ.63,300

సౌకర్యాలు:

విమాన టిక్కెట్లు (రెండు వైపుల)
భోజనం (ఉదయం మరియు రాత్రి)
రవాణా సౌకర్యం (AC)
వసతి సౌకార్యం (3 /5 స్టార్)
ఐఆర్ సిటీస్ -టూరిజం


















Tags:    

Similar News