చార్మినార్ వద్ద టెన్షన్

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ వద్ద ముస్లిం యువకులు పెద్దయెత్తన నిరసన తెలియజేశారు.

Update: 2022-06-10 12:35 GMT

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ వద్ద ముస్లిం యువకులు పెద్దయెత్తన నిరసన తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా బయటకు వచ్చి తమ నిరసనను తెలియచేశారు. ర్యాలీగా బయలుదేరిన ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అరెస్ట్ చేయాలంటూ...
నుపుర్ శర్మ, నిత్యానంద, రాజాసింగ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News