హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు ప్రారంభించారు

Update: 2022-01-20 07:39 GMT

హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికకు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు ప్రారంభించారు. దీంతో పంజాగుట్ట శ్మశాన వాటికపై రెండో ఫ్లై ఓవర్ ప్రారంభమయింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీలు ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య తొలుగుతుందన్నారు.

ట్రాఫిక్ సమస్యకు....
ఈ వంతెన నిర్మాణంతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం ఉండదు. పంజాగుట్టలోని శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై ఈ వంతెనను నిర్మించారు. శ్మశాన వాటికపై నుంచి చట్నీస్ హోటల్ వైపునకు వెళ్లేలా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.


Tags:    

Similar News