ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే.. రూ.2500.. క్యూ కట్టిన జనం

ఆ ఏటీఎం కు జనం క్యూ కట్టి.. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు పోటీపడ్డారు. శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి..

Update: 2023-01-04 05:53 GMT

old city hdfc ATM

హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఏటీఎంలో ప్రజలు రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వచ్చాయి. ఈ విషయం ఒకరి నుండి మరొకరికి తెలియడంతో.. ఆ ఏటీఎం కు జనం క్యూ కట్టి.. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు పోటీపడ్డారు. శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి డబ్బులు విత్ డ్రా చేసేందుకు హరిబౌలి చౌరస్తాలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం కార్డుతో రూ.500 విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. రూ.2500 వచ్చాయి.

వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. అప్పటికే స్థానికులకు ఈ విషయం తెలియడంతో.. డబ్బులు విత్ డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఇంతలో ఆ ఏటీఎం వద్దకు చేరుకున్న పోలీసులు.. రూ.500 డ్రా చేస్తే రూ.2500 వస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. దాంతో స్థానికులను ఇళ్లకు పంపి.. ఏటీఎం కేంద్రాన్ని మూసివేయించి.. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఆ ఏటీఎంలో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.



Tags:    

Similar News