నేటి నుంచి బయో ఏషియా సదస్సు
నేటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది.
నేటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ బయ ఏషియో సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సదస్సులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంది. ప్రజలకు ఉపయోగపడే వివిధ అంశాలపై చర్చలతో పాటు ప్రసంగాలు కూడా ఉండనున్నాయి.
అనేక అంశాలపై...
హైదరాబాద్ లో నేటి నుంచి జరుగుతున్న ఈ బయో ఏషియో సదస్సుకు యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా లైఫ్సైన్సెస్, ఆరోగ్యం, ఔషధ రంగాల అభివృద్ధిపై చర్చలు నిర్వహించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.