Cyber Fraud : హైదరాబాద్ లో మరో సైబర్ మోసం...ఆన్ లైన్ బెట్టింగ్ లో 75 లక్షలు స్వాహా

ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో మోసానికి సికింద్రాబాద్ యువకుడు గురయ్యాడు

Update: 2025-12-15 11:56 GMT

సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో రూపంలో బాధితులు బయటకు వస్తున్నారు. బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో మోసానికి సికింద్రాబాద్ యువకుడు గురయ్యాడు. యువకుడు 75 లక్షల రూపాయల నష్టపోయాడు. సికింద్రాబాద్‌కు చెందిన 32 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినో మోసానికి బలై రూ.75 లక్షలు కోల్పోయాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయం వెల్లడించారు. వాట్సాప్ ద్వారా పరిచయం అయి లాభాల ఆశ చూపిన మోసగాళ్లు పన్నిన వలలో ఈ యువకుడు పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం, 2021లో వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు బాధితుడిని సంప్రదించారు.

సులభంగా లాభాలు వస్తాయని...
క్రికెట్ బెట్టింగ్, తీన్ పత్తి, క్యాసినో గేమ్స్ ఆడి సులభంగా లాభాలు వస్తాయని యువకుడిని ఆన్ లైన్ లో నమ్మించారు. తొలిసారి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు యువకుడు. దీంతో మొదట రూ.10 వేల పెట్టుబడిపై కొంత లాభం వచ్చినట్టు చూపడంతో నమ్మిన బాధితుడు తర్వాత దాదాపు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ మొత్తం పూర్తిగా నష్టపోయినట్టు పోలీసులు తెలిపారు. నాలుగేళ్లలో ఆ యువకుడు 75 లక్షల రూపాయలను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తూ వచ్చాడు.
వేటినీ నమ్మొద్దన్నా...
2022 మార్చిలో మళ్లీ మోసగాళ్లు సంప్రదించి మరో ప్లాట్‌ఫామ్‌లో ఆడాలని ఒప్పించారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో బాధితుడు బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు, క్యూ ఆర్ కోడ్లు, క్యాష్ డిపాజిట్ మెషిన్ల ద్వారా వివిధ అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లకు మొత్తం రూ.75 లక్షలు బదిలీ చేశాడు. చివరకు ఆ మొత్తం మొత్తం కోల్పోయాడు. తాను మోసపోయినట్లు గుర్తించి యువకుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై మోసం, ఆన్‌లైన్ ఫ్రాడ్, అక్రమ బెట్టింగ్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల బారిన పడిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.






Tags:    

Similar News