భర్త మర్మాంగాన్ని కోసిన రెండవ భార్య

నందిగామ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్ లో చోటుచేసుకుంది

Update: 2023-07-22 09:33 GMT

నందిగామ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగన్ని రెండవ భార్య కోసేసిన ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనందబాబు మొదటగా ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకొని ముప్పాళ్ళ లో నివాసం ఉంటున్నాడు. అయితే గత రాత్రి ఆనందబాబు తన మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ ఉండగా రెండవ భార్య వరమ్మ చూసి ఆగ్రహానికి లోనైంది.

తనను పెళ్లి చేసుకుని మళ్లీ మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావు అంటూ ఆనంద్ బాబు పై ధ్వజమెత్తింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణ కాస్త పెద్దదవ్వడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆగ్రహానికి లోనైన వరమ్మ వెంటనే ఆనంద్ బాబు పై బ్లేడుతో దాడి చేసి మర్మాంగాలను కోసేసింది. దీంతో ఆనందబాబుకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. నొప్పితో విల విలలాడుతున్న అతడిని కుటుంబ సభ్యులు వచ్చి వెంటనే నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని విజయవాడకు తీసుకువెళ్లారు. ఇంతవరకు ఆ భర్త భార్యపై పోలీస్ లకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.


Tags:    

Similar News