ఢిల్లీ లో ఘోర ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు

Update: 2026-03-18 07:55 GMT

ఢిల్లీ లో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ పడమటి ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బహుళ అంతస్తుల నివాస భవనంలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు, అందులో ముగ్గురు చిన్నారులు, ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మంటల నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు భవనం నుంచి కిందికి దూకారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని భవనం నుంచి అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్అధికారులు తెలిపారు. వెంటనే 30 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక, రక్షణ చర్యలు ప్రారంభించారు

మంటలను అదుపులోకి తెచ్చేందుకు...
. ఒక నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చింది. లోపల కొంతమంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానించాం. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాం” అని ఓ డీఎఫ్ఎస్ అధికారి చెప్పారు. ఐదు అంతస్తుల భవనంలో రెండో, మూడో అంతస్తులను నివాసంగా ఉపయోగిస్తున్నారు. కింద ఉన్న బేస్‌మెంట్, గ్రౌండ్, మొదటి అంతస్తులను బట్టలు, కాస్మెటిక్స్ నిల్వ గోదాములుగా వాడుతున్నట్లు డీఎఫ్ఎస్ తెలిపింది. పైకప్పుపై తాత్కాలిక టిన్ షెడ్ కూడా ఉంది. ఘటన స్థలంలో నుంచి నల్లటి పొగ మేఘాలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. మంటలు భవనం కొంత భాగాన్ని పూర్తిగా కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఏడుగురిని బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు వారిని మృతిచెందినట్లు ప్రకటించినట్లు అధికారులు చెప్పారు.


Tags:    

Similar News