Road Accident : ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించార. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ప్రభుత్వ బస్సు దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
గాయాలపాలయిన వారిని...
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ స్థంభించకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.