సెల్‌ఫోన్ పేలి నలుగురు చిన్నారుల సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు

Update: 2024-03-25 04:24 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరటర్ జిల్లా పల్లవ్‌పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పిల్లలు నలుగురు సజీవ దహనమయ్యారు. మోదిపురం జనతా కాలనీలో ఓ ఇంట్లో భార్యాభర్తలు, నలుగురు పిల్లలు నివాసముంటున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణమంటూ...
అయితే సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా అది పేలి మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడగా, చిన్నారులు నలుగురు మరణించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ కాలనీ విషాదం నింపింది. సెల్‌ఫోన్ ప్రాణం తీసిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తల్లిదండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News