తిరుపతిలో జనసేన కార్యకర్త దారుణ హత్య

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు

Update: 2022-01-30 03:27 GMT

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు తిరుపతికి సమీపంలోని పేరూరు చెరువు వద్ద సుహానా భాషా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

హత్యకు గల కారణాలు...
పేరూరు చెరువు వద్ద ఉన్న సుహానా భాషాపై కొందరు దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News