విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

Update: 2022-01-01 03:28 GMT

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. రెండు బకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలయిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

మద్యం సేవించి.....
విశాఖలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి బైకు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యువకులు మద్యం సేవించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News