తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2023-03-20 06:16 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. త్రిచి - సాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఒక వ్యాన్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

అతి వేగమే...
మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News