ఆటోను ఢీకొట్టిన లారీ : ఐదుగురి మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2023-03-05 13:07 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం కారణంగానే....
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News