హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2023-05-21 03:16 GMT

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్ శివారులోని నార్సింగి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఆర్మూరు మండలం ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

నలుగురు మృతి....
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నామని తెలిపారు. ఆర్మూరు నుంచి గజ్వేల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News