Road Accident : కారు టైర్ పేలి.. ముగ్గురు మృతి

కారు టైర్ పంక్చర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది

Update: 2024-04-28 02:05 GMT

కారు టైర్ పంక్చర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. వెదుళ్లపాలెం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కారు టైర్ పేలి కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

కాకినాడ వెళుతుండగా...
పాయకరావుపేట నుంచి కాకినాడ వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మరణించారు. కారు టైరు పైలి డివైడర్ ను ఢీకొని ఆవలి వైపు వస్తున్న కంటైనర్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ మరణించారు. వికాస్ కు ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదం తెలుసుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు


Tags:    

Similar News