అయోధ్యలో బాలికపై అత్యాచారం

ఉత్తర్ ప్రదేశ్ ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది

Update: 2022-03-17 06:19 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరో అవామానవీయమైన ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిందితుడి కోసం గాలింపు....
అయోధ్యలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాలిక తరుపున బంధువులు ఆందోళన చేస్తున్నారు.


Tags:    

Similar News