గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి మృతి.. ఆ అనుమానాలు

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విచారణ నిమిత్తం తీసుకువచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు

Update: 2023-07-17 03:06 GMT

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విచారణ నిమిత్తం తీసుకువచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. బీహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు నానక్‌రాంగూడ లేబర్‌ క్యాంపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు కూలీలు లేబర్‌ క్యాంపు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డు నితీష్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది సీపీఆర్‌ చేసి సమీపంలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

గచ్చిబౌలి నానక్​రాంగూడలోని ఓ కంపెనీలో లేబర్​ క్యాంపు వద్ద బిహార్​కు చెందిన నితీష్ కుమార్​(32)సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కంపెనీలో పనిచేసే కొందరు కార్మికులు బయటకు వెళ్లి వస్తామని అనడంతో నితీశ్ కుమార్ తో పాటు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న దీపక్, పింటులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కార్మికులను సెక్యూరిటీ గార్డులు కొట్టడంతో పోలీసులకు సమాచారం అందింది. గచ్చిబౌలి పోలీసులు సెక్యూరిటీ గార్డులైన నితీశ్‌‌, దీపక్, పింటులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 8 గంటల సమయంలో పోలీస్‌‌స్టేషన్‌‌లో సెక్యూరిటీ గార్డ్ నితీశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కస్టడీలో ఈ మరణం చోటు చేసుకోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ ఏసీపీతో దర్యాప్తు చేయిస్తున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ నితీష్‌ ఛాతి నొప్పితో మృతిచెందినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని అన్నారు.


Tags:    

Similar News