NCRB REPORT : తెలంగాణలో పెరిగిన క్రైం.. మావవ అక్రమరవాణాలో మళ్లీ మొదటిస్థానం

ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2019 లో 1,18,338 కేసులు, 2020లో 1,35,885 కేసులు, 2021లో

Update: 2022-08-29 07:36 GMT

తెలంగాణలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) 2021 నివేదికలో వెల్లడించింది. సైబర్ నేరాల్లో, మానవ అక్రమరవాణాల్లో తెలంగాణ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. గతంలో కంటే తెలంగాణలో 200 శాతం నేరాలు పెరిగాయని, ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు, సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందని పేర్కొంది. ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఓ పక్క పాలకులు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్తున్నారు కానీ.. నేరాల సంఖ్యలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం కాస్త ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.

ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2019 లో 1,18,338 కేసులు, 2020లో 1,35,885 కేసులు, 2021లో 1,46,131 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు నమోదైతే దాదాపు 20 శాతం తెలంగాణ రాష్ట్రం లోనే జరగటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు, యువతులు, చిన్నారులపై నేరాలకు అడ్డా అయిన ఉత్తరప్రదేశ్ తెలంగాణ తర్వాత రెండే స్థానంలో ఉంది. లైంగిక అక్రమరవాణాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉండగా..ఆర్థిక నేరాల్లో రెండవ స్థానంలో ఉంది. వృద్ధులపై జరిగే దాడులలో మూడవ స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది తెలంగాణ దుస్థితి అని చెప్పాలి.
ఎన్సీఆర్బీ విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2020 నివేదిక ప్రకారం 2019లో 2,691 కేసులుండగా, తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 13.4 కేసుల చొప్పున 2020లో సైబర్ నేరాల సంఖ్య 5,024కి పెరిగింది. 2021లో తెలంగాణలో సైబర్ నేరాలు రెండు రెట్లు పెరిగాయి. ఏడాది కాలంలో మొత్తం 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2020లో 1,379 కేసులు నమోదవగా, ఒక్క హైదరాబాద్ పోలీసులే 2021 వ సంవత్సరంలో 5,646 సైబర్ క్రైమ్‌ల కేసులు నమోదు చేశారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు సైబర్ క్రైం బారిన పడుతున్నట్టుగా సమాచారం.





Tags:    

Similar News