ఇల్లు అద్దెకు కావాలని వచ్చి.. కత్తితో బెదిరించి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దుండగుడు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు. మహిళను మాటల్లో పెట్టి.. తనతో పాటు

Update: 2022-01-21 06:04 GMT

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ.. ఎక్కడ జరిగే నేరాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. భాగ్యనగరంలో ప్రతి కాలనీలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ నేరగాళ్లు ఏమాత్రం జంకడం లేదు. తమ పని చేసుకుపోతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఓ దుండగుడు చైన్ స్నాచింగ్ కు యత్నించాడు. అది కాస్తా విఫలమవ్వడంతో మహిళ సెల్ఫోన్ తో పరారయ్యాడు.

Also Read : తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దుండగుడు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చాడు. మహిళను మాటల్లో పెట్టి.. తనతో పాటు తీసుకొచ్చిన కత్తితో బెదిరించి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. కానీ.. మహిళ అరుపులు, కేకలు వేయడంతో ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలో మహిళ మెడ, కాలికి గాయాలయ్యాయి. చుట్టుపక్కలవారు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News