15 మంది విద్యార్థులు మృతి

మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు

Update: 2022-12-21 12:28 GMT

మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్టడీటూర్ కోసం విద్యార్థులతో వెళుతున్న రెండు బస్సులు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలోని బిష్ణుపూర్ ఖైపూర్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది.

స్టడీ టూర్ కోసం...
విద్యార్థులంతా హయ్యర్ సెకండరీ స్కూలు వారని తేలింది. స్టడీ టూర్ కోసం ఖోపూమ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని గాయపడిన వారు తెలిపారు. 20 మంది విద్యార్థులు ఇంఫాల్ లోని మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని, అదుపుతప్పి లోయలో పడటం వల్లనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు మృతి చెందారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు


Tags:    

Similar News