ఘోర ప్రమాదం : నలుగురు సజీవ దహనం

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు

Update: 2023-02-17 05:06 GMT

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్ అజ్మీర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు పెట్రోలు ట్యాంకర్లు ఢీకొట్టాయి. దీంతో రహదారిపై పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

ట్రాఫిక్ కు అంతరాయం...
ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయినట్లు గుర్తించారు. రాజస్థాన్ అజ్మీర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు దహనమయిన పెట్రోలు ట్యాంకర్లను అక్కడి నుంచి తొలగిస్తున్నారు.


Tags:    

Similar News