యూపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు... 18 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Update: 2022-06-23 03:47 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒక ట్రక్కును చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఈ దుర్ఘటన జరిగింది. యూపీలోని పీలీభీత్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. హరిద్వార్ లో స్నానం చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరో ప్రమాదంలో...
మరో ప్రమాదంలోనూ ఉత్తర్ ప్రదేశ్ లో ఎనిమిది మంది మరణించారు. యూపీలోని హమీర్ పూర్ లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. మౌదహా మాక్రావాన లోని జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కును ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న వారిలో ఎక్కువ మంది మరణించారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News