రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

నల్లకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు

Update: 2022-11-04 04:55 GMT

Narasaraopet fire accident

నల్లకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నిన్న అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలోని అడిక్‌మెట్ ఫ్లై ఓవర్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు నస్కటి భవన్, మల్లెపు రోషన్ లు వేగంగా బైక్ పై వచ్చి డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైకు మీద ప్రయాణిస్తున్న ఈ ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.

నల్లకుంట సమీపంలో...
మల్లెపు రోషన్ కామారెడ్డికి చెందిన విద్యార్థి. ఏడుగురు స్నేహితులు నాలుగు బైకులపై తార్నాక నుంచి నల్లకుంట వస్తుండగా ఒక బైక్ పై ఉన్న రోషన్, భవన్ లు డివైడర్ ను ఢీకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News