మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ .. ఇద్దరు మృతి

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రోహిత్ ఇద్దరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2021-12-06 05:58 GMT

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న రోహిత్ అనే యువకుడు ఇద్దరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరూ బీహారీ వలస కూలీలుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2 లో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ప్రమాదం చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారి రోహిత్ గా పోలీసులు గుర్తించారు. రోహిత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పబ్ లో పూటుగా తాగి....
రోహిత్ అతని మిత్రులు కలసి పబ్ లో పూటుగా తాగారు. మద్యం తాగి వాహనం నడుపుతూ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2కు రాగానే రోడ్డు దాటుతున్న బీహారీ కూలీలు త్రిభువన్, ఉపేందర్ లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్ తో పాటు అతని స్నేహితులు ఇద్దరు ఉన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News