తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు

Update: 2022-09-18 03:20 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. సేలం జిల్లా అత్తూరు లో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న ప్రయివేటు బస్సును లారీని బస్సును ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.

ఒకే కుటుంబానికి చెందిన...
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయలయిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News