బైక్ మీద ఉన్న ఫైన్స్ కట్టలేక

Update: 2023-05-26 02:36 GMT

హన్మకొండలో చలాన్లు చెల్లించలేదని ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేయడంతో 52 ఏళ్ల వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు వేధించారని ఆరోపణలు ఉన్నాయి. హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మొగిలి హన్మకొండలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. మొగిలి మే 21న పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, మోటర్‌బైక్ నంబర్‌కు వ్యతిరేకంగా 15 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 7000 రూపాయలకు పైగా ఫైన్స్ ఉన్నట్లు గుర్తించారు.

మొగిలి ఫైన్స్ కట్టడానికి మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ ఫలించలేదు. బకాయిలను క్లియర్ చేయమని పోలీసులు మొగిలిపై ఒత్తిడి చేశారు. బైక్ ఫైన్స్ చెల్లిస్తేనే బండిని తీసుకుని వెళ్లాలని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల వేధింపుల వల్లే మొగిలి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొగిలి మృతి చెందాడు. మొగిలి కుటుంబ సభ్యులు, అతని మృతదేహాన్ని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనకు దిగారు.


Tags:    

Similar News