రూ.2000 నోట్ల కోసం రూ.1,300 కోట్ల ఖర్చు- ఆర్బీఐ కీలక నివేదిక

పెద్ద నోట్ల ఉపసంహరణ సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం రూ.2000..

Update: 2023-09-30 03:29 GMT

పెద్ద నోట్ల ఉపసంహరణ సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం రూ.2000 నోట్లను ముద్రించింది. ఇప్పుడు ఈ నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ నోట్లపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. ఆర్‌టీఐ కింద రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.. మొత్తం రూ.7.40 లక్షల కోట్ల విలువైన 370 కోట్లకు పైగా నోట్లను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఇందుకు సంబంధించి ది హిందూ బిజినెస్‌లో ప్రచురించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

ఆర్బీఐకి మూడు దశల్లో 2,000 రూపాయల నోట్లు అందాయని నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ 2016-17లో 350.4 కోట్ల నోట్లు రాగా, 2017-18లో 15.1 కోట్ల నోట్లు, 2018-19లో 4.7 కోట్ల నోట్లు వచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. నోట్ టిప్ప్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ ఈ నోట్లను ప్రింట్ చేసి ఆర్బీఐకి అందజేసింది.

వెయ్యి నోట్ల ముద్రణకు రూ.4,180 ఖర్చు:

అయితే ఓ నోట్ ప్రింటింగ్ కంపెనీ రూ.2000 ముఖ విలువ కలిగిన వెయ్యి నోట్లను రూ.4,180కి ఆర్బీఐకి ముద్రణ చేసి ఇచ్చింది. 2016-17లో ఆర్‌బీఐ 1000 నోట్లకు రూ. 3,540 చొప్పున 350.4 కోట్ల నోట్లను విడుదల చేసింది. 2017-18, 2018-19 లో వెయ్యి నోట్లను వరుసగా రూ.4,180, రూ.3,530 గా ముద్రించారు. అంటే ఒక నోటు దాదాపు రూ. 3.50 నుంచి రూ.4.18 వరకు ఖర్చు అయ్యింది అని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.

రూ. 2000 నోట్లు ఎన్ని ఉన్నాయి ?

ఆర్బీఐ విడుదల చేసిన రూ.2000 నోట్ల మొత్తం రూ.7.40 లక్షల కోట్లకుపైగా ఉంది. ఆర్‌బీఐ క్రమంగా నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. 2023 మార్చి నెలలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. మే నెలలో ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించింది. 93 శాతం వరకు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. ఈ నోట్లను వాపస్ చేసేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News