RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇక మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదు

RBI: బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు విధిస్తుంటుంది. బ్యాంకు అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌

Update: 2024-01-04 02:56 GMT

RBI

RBI: బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు విధిస్తుంటుంది. బ్యాంకు అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ విధానం ఒక్కోనగరంలో ఒక్కో విధంగా ఉంది. అయితే ప్రతి నెల కనీస బ్యలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీకు పెనాల్టీ ఛార్జీలతో పాటు జీఎస్టీ కూడా వడ్డిస్తుంటుంది. అయితే ఇటీవల కొన్ని బ్యాంకులు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండటం తొలగించింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విధానం పాటిస్తున్నాయి. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలుగా ఎలాంటి కనీస బ్యాలెన్స్‌ ఉండని అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు విధించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల మొత్తాన్ని తగ్గించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న అనేక చర్యలలో పై మినిమమ్ బ్యాలెన్స్ రుసుము నిర్ణయం ఒకటి. రెండేళ్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరగని ఖాతాలను బ్యాంకులు పనిచేయని ఖాతాలుగా గుర్తిస్తాయి బ్యాంకులు. ఇప్పుడు ఆర్బీఐ ఈ చర్యను మార్చింది.

బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉంది. జీతాల ఖాతాలకు కూడా ఈ ప్రత్యేక హక్కు ఉంది. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ వంటి బ్యాంకుల్లో కనీస నిల్వ మొత్తం రూ.10,000. కొన్ని బ్యాంకుల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు కనీస నిల్వ ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా చాలా సంవత్సరాలుగా పనిచేయని ఖాతాలకు అనేక వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఒకవేళ, కస్టమర్ తన పాత ఖాతాను పునరుద్ధరించాలనుకుంటే, పెనాల్టీ చెల్లించడానికి వెనుకాడుతారు. దీన్ని నివారించడానికి మినిమమ్ బ్యాలెన్స్ ఫీజు వసూలు చేయవద్దని ఆర్‌బిఐ బ్యాంకులకు తెలిపింది. ఆర్బీఐ నిర్ణయంతో చాలా మందికి రిలీఫ్‌ అవుతుంది.

Tags:    

Similar News