PM Kisan: మహిళా రైతులకు కేంద్రం శుభవార్త.. పీఎం కిసాన్‌ సాయం రెట్టింపు?

కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న పథకాల్లో..

Update: 2024-01-11 11:07 GMT

PM Kisan

PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ఒకటి. ఇందులో ప్రస్తుతం రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ మొత్తం ఒకే సారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రైతులకురూ. 12,000 లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ ఆలోచన పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ఉందని తెలిసినట్లు రాయిటర్స్‌ కథనంలో పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ప్రకటించినట్లయితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్ల ఖర్చు పెరగనుందని బడ్జెట్‌ ప్రతిపాదనలో చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కేంద్రం ఇలాంటి ప్రణాళిక ఎప్పుడు కూడా చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే విధంగా ఈ రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయం పెంచే విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం పురుషులు, మహిళలు ఇద్దరికీ సంవత్సరానికి రూ.6,000 బదిలీ చేస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇప్పటివరకు 15 విడతలుగా 110 మిలియన్లకు పైగా రైతులకు రూ.281,000 కోట్లకు పైగా పంపిణీ చేసింది. భారతదేశంలో 260 మిలియన్లకు పైగా రైతులు ఉన్నారు. వారి కుటుంబాలతో పాటు, వారు 1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశంలో భారీ ఓటింగ్ కూటమిగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం రైతుల్లో 60% మంది మహిళలు ఉన్నారు.

Tags:    

Similar News