Gold: భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా?

Gold, Silver: బడ్జెట్‌కు ముందే బంగారం, వెండిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి

Update: 2024-01-24 07:02 GMT

Gold, Silver Price

Gold, Silver: బడ్జెట్‌కు ముందే బంగారం, వెండిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 12.50 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అంతే కాకుండా విలువైన లోహాలతో తయారు చేసిన నాణేలపై కస్టమ్ డ్యూటీని కూడా పెంచారు. బంగారం, వెండి, విలువైన లోహం, విలువైన లోహాల నాణేలకు సంబంధించిన చిన్న భాగాలపై దిగుమతి సుంకంలో ఈ మార్పు కనిపించింది.

బంగారం, వెండి దిగుమతిపై సుంకం ఎంత పెరిగింది?

బంగారం, వెండి దిగుమతిపై సుంకం ఇప్పుడు 15 శాతానికి మార్చింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD), 5 శాతం అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC) ఉంటాయి. అయితే దీనిపై విధించిన సోషల్ వెల్ఫేర్ సెస్ (ఎస్ డబ్ల్యూఎస్)లో మాత్రం పెంపుదల లేదు.

బంగారం, వెండికి సంబంధించిన చిన్న భాగాలైన హుక్స్, క్లాంప్స్, పిన్స్, క్యాచ్‌లు, స్క్రూలపై ఈ దిగుమతి సుంకం పెరిగింది. ఈ చిన్న భాగాలు సాధారణంగా ఆభరణం తయారు చేసిన తర్వాత వాటి ఫిట్టింగ్‌ భాగంలో ఉంచుతారు.

అలాగే ప్రెషియస్ మెటల్స్ క్యాటలిస్ట్‌పై దిగుమతి సుంకాన్ని కూడా పెంచింది కేంద్రం. దానిని 14.35 శాతానికి పెంచారు. ఇది ప్రాథమిక కస్టమ్ డ్యూటీ 10 శాతం, AIDC 4.35 శాతం వసూలు చేస్తుంది. దీనిపై సాంఘిక సంక్షేమ సెస్ విధించనున్నారు.

కొత్త దిగుమతి సుంకాలు ఎప్పుడు వర్తిస్తాయి?

దిగుమతి సుంకం కొత్త రేట్లు జనవరి 22 అమల్లోకి వచ్చాయి. దేశ బడ్జెట్‌కు ఇప్పుడు 8 రోజులు మిగిలి ఉన్నాయి. ఇది 1 ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో ప్రకటించకుండా జనవరి 22 నుంచే ఆర్థిక శాఖ అమలులోకి తెచ్చింది.

ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది

బంగారం, వెండి ముడి దిగుమతులపై, బంగారం, వెండి భాగాలపై విధించిన దిగుమతి సుంకంలో బ్యాలెన్స్ లేకపోవడం, దానిని సక్రమంగా వినియోగించకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, ఈ దిగుమతి సుంకాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News