జగన్ తో కొనసాగుతున్న సినీ ప్రముఖుల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది

Update: 2022-02-10 07:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమయింది. ప్రధానంగా టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. టిక్కెట్ల ధరలు ఒక అంశం మాత్రమే. నంది అవార్డుల ప్రకటన, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

17 అంశాలపై......
మొత్తం 17 అంశాలు ప్రధానంగా జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు చర్చించనున్నారు. సినీ రంగానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలను ఏపీలో ఏర్పాటు చేయడంపై కూడా ఈ చర్చలో ప్రధాన అంశం కానుందని తెలిసింది. ఈ సమావేశంలో చిరంజీవి, మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ఆలీ, పోసాని కృష్ణమురళితో పాటు మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News