శ్రీవారి బ్రహ్మోత్సవాలుకు చంద్రబాబుకు ఆహ్వానం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆహ్వానించింది
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆహ్వానించింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఆహ్వానించారు.
టీటీడీ పాలక మండలి..
బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.