రేపు హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

రేపు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మేలో జరగనుంది.

Update: 2023-03-27 05:46 GMT

రేపు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మేలో జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని...
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు.


Tags:    

Similar News