Chandrababu : ముగ్గురు పిల్లలు.. ముద్దు ఇదే నా నినాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు

Update: 2026-03-09 12:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. డోన్ సభలో ఆయన మాట్లాడుతూ ఇద్దరుంటే ఒకే.. ముగ్గురుంటే ముద్దు అని ఆయన అన్నారు. జనాభా తగ్గడం వల్ల రాష్ట్రం యువ శక్తిని కోల్పోతున్నామని చంద్రబాబు తెలిపారు. జనాభా పెరుగుదల విషయంలో ప్రతి ఒక్కరూ పునరాలోచించాని కోరారు. ముగ్గురు పిల్లలుంటే వారికి ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెిపారు. మామిడికి రేటు తగ్గితే కేజీకి రూ.4లు సబ్సీడీ ఇచ్చానని, 50 శాతం మామిడి పండ్లకు తొడిగే కవరుకు సబ్సీడీ ఇస్తున్నామని చెప్పారు. రాయల సీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామన్న చంద్రబాబు కేంద్రం రూ.30 వేల కోట్లు పూర్వోదయ పథకం కింద ఇస్తుందని తెలిపారు.

లడ్డూ కల్తీ చేసిన వారిని...

తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిపై ప్రక్షాళన చేస్తున్నామని, వాటిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వెంకటేశ్వరస్వామికి అపవిత్రం చేస్తే తాను ఉపేక్షించనని, ఎవరు చేసినా ఒప్పుకోనన్నారు. వివేకా నందరెడ్డిని హత్య చేసి నా చేతిలోనే కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారన్నారు. నేరాలు ఘోరాలు చేశారని, జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత తెలుసుకున్నారని చంద్రబాబు తెలిపారు. తిరుమల లడ్డుపైనా రాజకీయం చేసి తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. తాను కష్టపడేది పేదల కోసమే. పేదలకు అండగా ఉంటానని చెప్పారు.


Tags:    

Similar News