పుట్టపర్తిలోకి నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 49వ రోజుకు చేరుకుంది

Update: 2023-03-21 03:01 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 49వ రోజుకు చేరుకుంది. నేడు పుట్టపర్తి నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 612.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు ఉదయం కదిరి నియోజకవర్గంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ముత్యాలమ్మ చెరువు వద్ద టిడ్కో గృహాలను లోకేష్ పరిశీలిస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశం కానున్నారు. 8.45 గంటలకు ఆలీపూర్ తండా వద్ద స్థానికులతో మాటా మంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.

టిడ్కో ఇళ్లను...
మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముత్యాలమ్మ చెరువు వద్ద భోజన విరామానికి ఆగుతారు. తిరిగి పాదయాత్రను మధ్యాహ్నం 2.30 నుంచి ప్రారంభిస్తారు. 3.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. 3.45 గంటలకు పులగంపల్లి వద్ద స్థానికులతో సమావేశమవుతారు. 4.50 గంటలకు మిట్టపల్లి వద్ద దివ్యాంగులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారికి భరోసా ఇవ్వనున్నారు. రాత్రికి గొనుకువారిపల్లి క్రాస్ వద్ద బస చేయనున్నారు.


Tags:    

Similar News