షాను కలసిన నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు

Update: 2023-10-12 02:45 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఆయన షాతో భేటీ అయ్యారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని లోకేష్ అమిత్ షాకు వివరించారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసు అంటూ తప్పుడు కేసులు పెట్టి నెల రోజుల నుంచి జైలులో ఉంచి వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు అరెస్ట్ పై...
వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. జైలులో ఉన్న తన తండ్రి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం మరిన్ని కేసులు బనాయించే దిశగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురంద్రీశ్వరి కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News