ముగ్గురిని పెట్టుకుని రాజీనామాలా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీ ఎంపీలను రాజీనామా చేయాలని కోరడం చర్చనీయాంశమైంది.

Update: 2021-12-11 08:59 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడతారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అప్పట్లో జగన్ టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి మాత్రం తప్పుకున్నారు.

గతంలో మాత్రం...
ఇప్పుడు అదే చంద్రబాబు వైసీపీ ఎంపీలను రాజీనామా చేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఆయనకు ఉన్నది ముగ్గురు ఎంపీలు. అందులో ఇద్దరు ఆయన మాట వినరు. అందుకే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి. హోదా కోసం రాజీనామా చేస్తే ఇప్పుడు వస్తుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాజకీయం కోసమే మళ్లీ రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు.


Tags:    

Similar News