నేడు కదిరి నియోజకవర్గంలోకి లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది

Update: 2023-03-17 03:08 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 565 కిలోమీటర్ల దూరం నడిచారు. 45వ రోజున ఆయన పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఉదయం 9 గంటలకు కమ్మపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడ స్థానికులతో ఆయన సమావేశమవుతారు. అనతరం 12.15 గంటలకు ములకల చెరువు టీటీడీ కల్యాణ మండపం వద్ద భోజన విరామానికి ఆగుతారు. అక్కడ స్థానికులతో ఆయన సమస్యలపై చర్చించనున్నారు.

బహిరంగ సభ....
అనంతరం పాదయాత్ర బయలుదేరి ములకలచెరువు సర్కిల్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ స్థానికులతో మాటామంతీ జరుపుతారు. నాలుగు గంటలకు ములకల చెరువు బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఏడుగంటలకు కదిరి నియోజకవర్గంలోని చీకటిమానుపల్లిలో రాత్రి బస చేయనున్నారు.


Tags:    

Similar News