వేమిరెడ్డి ఇంటికి క్యూ కడుతున్న నేతలు

వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు

Update: 2024-02-21 12:49 GMT

వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కలసి వేమిరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వేమిరెడ్డి మృదుస్వభావి అని, ఆయన ఎవరినీ ఒక మాట కూడా అనరని, అలాంటి వేమిరెడ్డికి వైసీపీలో అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రలు చేసే నేత కాదని అన్నారు. ఆయన వైసీపీలో ఇమడలేక రాజీనామా చేశారన్నారు.

పలువురు నేతలు...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు వైసిపి,టిడిపి నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలుస్తున్నారు. దీంతో నెల్లూరులోని ఆయన ఇల్లు నాయకుల రాకతో బిజీగా మారిపోయింది. వైసీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించగానే వేమిరెడ్డి ఇంటికి చేరుకుని ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు నెల్లూరు నగరం లో సుమారు నలుగురు కార్పొరేటర్లు, జిల్లా లోని పలు ప్రాంతాల్లోని నాయకులు వేమిరెడ్డి ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు.


Tags:    

Similar News